సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

28, ఆగస్టు 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 14

 

మంత్రమేలన ప్రకారము

మంత్రరాజమునందు ఈ విధంగా చెప్పబడినది - త్రిపురా మరియు నిత్యాదేవీల మంత్రములందు అంశకాదులు దర్శనీయము కాదు. కానీ అభిచారాది సిద్ధి గురించి ఇక్కడ ఒక విశేషం చెప్పవలసినది ఉంది. మంత్రము యొక్క మొదటి అక్షరమును నామము యొక్క మొదటి  అక్షరముతో గణించాలి. ఆరు, ఎనిమిది, పన్నెండు సంఖ్యవస్తే ఆ మంత్రము యొక్క మొదటి వర్ణము శత్రువు అవుతుంది. దీనితో హితము కలగదు. రాశినామము నుండి నక్షత్రము సప్తమ, పంచమ, తృతీయ అయితే సాధ్య నామము యొక్క అంశమును తెలుసుకొని అనుగ్రహ కర్మ చెయ్యాలి. 

26, ఆగస్టు 2020, బుధవారం

మహామనుస్తవం - 5

 

జీవగ్రాహముదగ్రా నిజపదజాలే నిధాయ మాం యస్యాః|

       జాగర్తి స్వీకర్తుం దృష్టి: కాలేత్ర తంతునాభనిభా||

సాలెపురుగు తదేక దృష్టితో తన ఆహారమును చూచి తన సాలెగూటిలోనికి తీసుకొని అందు ఉంచి, తనకు అవసరమైనప్పుడు ఆ ఆహారమును మ్రింగివేయును. ఆ విధంగానే శ్రీమాత తన ప్రియ భక్తుడిని తదేక దృష్టితో చూసి (=అనగా పరీక్షించి) ముందుగా తన సామీప్యమునకు తీసుకొనును. ఆ తర్వాత ఆ భక్తుని సాధన, భక్తి, పూర్వజన్మ ఫలం మొదలగు వాని అనుగుణంగా శ్రీమాత ఆ భకునికి సాయుజ్య ముక్తినొసగును.

20, ఆగస్టు 2020, గురువారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ద్వితీయశ్వాస - 13

 

త్రైలోక్యడామర తంత్రము

ఇందు ఈవిధముగా చెప్పబడినది -

మంత్రములకు న్యాసము - పల్లవము మరియు ప్రణవము - శిరస్సు. ఈ రెండింటిచేత సంయుక్తమైన మంత్రము కామధేను సమానముగా ఫలప్రదము. న్యాసరహిత మంత్రము మూగతో సమానము. ఆసన రహిత సుప్త (నిద్ర), పల్లవ రహిత నగ్న,

18, ఆగస్టు 2020, మంగళవారం

మహామనుస్తవం - 4

 

 అచ్ఛలజీవనవిధయే తుచ్ఛమనోవాసకచ్ఛతో హృత్వా|

 విచ్ఛందకనిజపదభూసేవినమేనం వ్యధత్త యా సదయా||


హీనమైన, అల్పమైన, బురదమయమైన మానసిక జీవనవిధానం నుండి తన భక్త సాధకుడిని ప్రేమతో అతని సంకల్పం లేకుండానే తన పాదసేవకునిగా చేసుకుంటుంది.

3, ఆగస్టు 2020, సోమవారం

భక్తిపద్యములు2





సాత్వికసపర్యలకువేదసంస్తుతులకు
నామసంకీర్తనలకర్చనలకునీవు
పల్కవేల?మరివడిగాపల్కెదవుశ
వవరివస్యముకేలశివప్రియసఖి

మహామనుస్తవం 3



మూర్తిమపశ్యమమూర్తేరపి యద్ దేవ్యాఃపురా శిలాశిల్పే|
చేతంత్యథ చేతయన్తీకృపాహి సేతిస్మరామి సుందర్యాః||

పాతరోజుల్లో త్రిపురసుందరీ అమ్మవారి విగ్రహాన్ని చూసినప్పుడు అది విగ్రహంలా కాక, ఒక చైతన్యరూపంగా కనపడి నాయందు ఆ చైతన్యమును ప్రవేశపెట్టినట్టుగా భావన కలిగేది.